గవర్నర్ పర్యటనలో మరోసారి ప్రోటోకాల్ వివాదం

గవర్నర్ పర్యటనలో మరోసారి ప్రోటోకాల్ వివాదం

హనుకొండ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ తమిళి సై కు మరోసారి అవమానం జరిగింది. కాకతీయ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవానికి ఛాన్సలర్ హోదాలో తమిళిసై పాల్గొన్నారు. అయితే ఈసారి కూడా గవర్నర్ పర్యటనలో  అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. గవర్నర్ కు స్వాగతం పలికేందేకు కలెక్టర్ రాజీవన్ హన్మంత్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హాజరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది. దీంతో కేయూ గెస్ట్ హౌజ్ దగ్గర RDO వాసుచంద్ర, డీసీపీ స్వాతగం పలికారు.

 ఈ కార్యక్రమంలో గవర్నర్ 56 మందికి PHD పట్టాలు, బంగారు పతకాలు అందజేశారు.   ఈ సందర్బంగా మాట్లాడిన గవర్నర్ ..విద్యార్థులు క్రియేటివ్ గా ఆలోచించాలన్నారు. ఎన్నో  సవాళ్ళను ఎదుర్కొంటూ  ముందుకు పోవాలన్నారు.  ఆన్ రైడ్ ను పక్కకు పెట్టి.. ప్రకృతిని ఆస్వాదించాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని చెప్పారు. లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ.. వ్యక్తిత్వ వికాసం సాధించాలన్నారు.  మహిళలు సాధారణ కోర్సులు కాకుండా.. వృత్తి పరమైన మెడికల్ కోర్సుల విద్యను అభ్యసించాలన్నారు.