ఎంతో కష్టపడి జాతీయ జెండాను ఎగురవేసిన వృద్ద  జంట

ఎంతో కష్టపడి జాతీయ జెండాను ఎగురవేసిన వృద్ద  జంట

సోషల్ మీడియాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఆయన ఏదైనా షేర్ చేశాడంటే అది కచ్చితంగా అందరిని కదిలిస్తుంది. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో  తెగ వైరల్ గా మారింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం  సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ 'హర్ ఘర్ తిరంగా' అని పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా భారతీయులు ప్రచారాన్ని ముక్తకంఠంతో స్వీకరించారు.

అందులో భాగంగా ఓ వృద్ద  జంట చాలా కష్టపడి తమ ఇంటి పై జాతీయ జెండాను ఎగురవేయడంలో విజయం సాధించారు. ఈ ఫోటోలో వృద్ద  జంట తమ ఇంటి పైకప్పుపై జాతీయ జెండాను ఎగురవేసేందుకు చాలా కష్టపడుతున్నట్లుగా కనిపిస్తుంది. భార్య ఓ ఇనుప డ్రమ్‌పై నిలబడి  జెండాను ఇంటి కప్పుపై  ఉంచడానికి ప్రయత్నిస్తుంటే ఆమె కిందపడకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు ఆమె భర్త. 

అయితే  ఈ ఫోటో ఎక్కడన్నది తెలియదు కానీ ఆనంద్ మహీంద్రాను మాత్రం బాగా కట్టిపడేసింది. దీంతో  ఆయన తన ట్విట్టర్ లోకి వెళ్లి. "స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంత గొడవ ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే.. ఈ ఇద్దరిని అడగండి. వారు ఏ ఉపన్యాసం చేయగలిగే దానికంటే బాగా వివరిస్తారు. జై హింద్, " అంటూ పోస్ట్ చేసారు. ఈ  పోస్ట్ కు ఇప్పటివరకు  లక్షా ముప్పై ఆరు వేల లైక్‌లు రాగా, 13 వేల మంది రీట్వీట్ చేశారు.