25న ఆషాఢమాసం బోనాల నిర్వహణ

 25న ఆషాఢమాసం బోనాల నిర్వహణ
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: ఈ నెల 25 న రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆషాఢమాసం బోనాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD) లో అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా బోనాలను నిర్వాహించుకోలేక పోయామని గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరం ఘనంగా ఆషాడ బోనాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి  KCR ఆదేశించారని తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామన్నారు.   
జులై 11 న గోల్కొండ బోనాలు, 25 వ తేదీన సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1 వ తేదీన హైదరాబాదు బోనాల ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. 25 వ తేదీన జరిగే సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,  దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మలారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, DGP మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ లు అంజని కుమార్, మహేష్ భగవత్, సజ్జనార్, వివిధ శాఖల అధికారులు  పాల్గొంటారు.