- ఓయూ రిజిస్ట్రార్కు స్టూడెంట్ల వినతి
ఓయూ, వెలుగు: ఎల్ఎల్బీ సెమిస్టర్ ఎగ్జామ్స్ను మళ్లీ నిర్వహించాలని ఓయూ స్టూడెంట్లు కోరారు. ఈ మేరకు బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్టూడెంట్లు ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మినారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ.. లా కాలేజీ ఈ–1 హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, పెంచిన కోర్సుల ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గతంలో 5వ సెమిస్టర్ ఎగ్జామ్స్ను స్టూడెంట్లు బహిష్కరించి ధర్నా నిర్వహించారు.
సుమారు 20 మంది స్టూడెంట్లు ఎగ్జామ్కు హాజరు కాలేదని.. తిరిగి వాటిని నిర్వహించి న్యాయం చేయాలన్నారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మెస్ను వెంటనే ప్రారంభించాలన్నారు. పెంచిన కోర్సుల ఫీజులపై, సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజులపై కూడా దృష్టిపెట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు లెనిన్, నెల్లి సత్య పాల్గొన్నారు.