లడఖ్ సమీపంలోకి పాక్ యుద్ధ విమానాలు

లడఖ్ సమీపంలోకి పాక్ యుద్ధ విమానాలు

లడఖ్ సరిహద్దులో ఉన్న స్కర్దూ ఎయిర్ బేస్ కు మూడు సీ-130 యుద్ధ విమానాలను తరలించింది పాకిస్తాన్. జేఎఫ్-17 ఫైటర్ జెట్లను కూడా తరలించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి దీంతో ఈ ప్రాంతంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. అలర్టైన భారత్… సరిహద్దుల వెంబడి నిఘాను ముమ్మరం చేసింది.

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీయడాన్ని పాక్ వ్యతిరేకిస్తోంది. దీంతో జమ్మూకశ్మీర్ లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్నిసృష్టిస్తోంది పాక్.