
లండన్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు మ్యాచ్ల సిరీస్ను సచిన్ టెండూల్కర్–జేమ్స్ అండర్సన్ పేరు మీద నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ’గా దీనికి పేరు పెట్టనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
గతంలో ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ, అతని కుమారుడు మన్సూర్ అలీఖాన్ పటౌడీ పేర్ల మీద ‘పటౌడీ ట్రోఫీ’ కోసం యూకేలో ఇంగ్లండ్, ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్లు నిర్వహించారు. కానీ ఈ ట్రోఫీని విరమించుకుంటున్నట్లు ఈసీబీ మార్చిలో పటౌడీ ఫ్యామిలీకి లేఖ రాసింది. దీనిపై ఎలాంటి స్పందన వచ్చిందో తెలియరాలేదు. ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకరైన సచిన్ 15921 రన్స్తో టాప్లో ఉండగా, అండర్సన్ 704 వికెట్లు సాధించాడు. ఈ ఇద్దరికి గుర్తింపుగా ఈ ట్రోఫీకి పేరుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.