బ్రిటిషర్లనే తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ది

బ్రిటిషర్లనే తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ది

శ్రీనగర్: ఆర్టికల్ 370ని తిరిగి పునరుద్ధరిస్తారనే నమ్మకంతో జమ్మూ కాశ్మీర్‌‌లో ఇంకా చాలామంది ఉన్నారని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ చెప్పారు. అంతకుముందు రోజు గులాంనబీ ఆజాద్ చేసిన కామెంట్లను ఆమె తప్పుపట్టారు. అవి కేవలం ఆయన వ్యక్తిగతమైనవేనని అన్నారు. ఆర్టికల్ 370ని తిరిగి తేవాలంటే కాంగ్రెస్​కు పార్లమెంటులో మూడింట రెండువంతులు మెజార్టీ కావాలని, అంత మెజార్టీ తన జీవితకాలంలో కాంగ్రెస్​కు రాలేదని ఆజాద్ ఆదివారం కామెంట్ చేశారు. కాశ్మీర్​కు ప్రత్యేక హోదా తిరిగి తేవడం సాధ్యం కాదన్నారు. దీనిపై ముఫ్తీ సోమవారం స్పందించారు. ‘‘బ్రిటిషర్లనే తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్​ది. ఆర్టికల్​ 370 ని తిరిగి తీసుకురాలేదా!. ఆ నమ్మకం ఉన్నోళ్లున్నరు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతాం. కాశ్మీర్​లో బీజేపీ మితిమీరిన చర్యలను అంతం చేస్తం” అని ముఫ్తీ అన్నారు.