న్యూఢిల్లీ: నాలుగేళ్ల చిన్నారి గొంతుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. జాతీయ గేయం వందేమాతరంను మిజోరంకు చెందిన ఎస్తేర్ హమ్తే అనే బాలిక పాడిన విధానం మోడీని ఆకర్షించింది. ఎస్తేర్ పాడుతున్న వీడియోను మిజోరం సీఎం జొరమ్తంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను చూసిన మోడీ దీన్ని రీట్వీట్ చేశారు. చిన్నారి పాడిన విధానం బాగుందంటూ మోడీ ప్రశంసించారు. ఎస్తేర్పై గర్వంగా ఉందంటూ మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. వేల సంఖ్యలో నెటిజన్స్ లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు.
Adorable and admirable! Proud of Esther Hnamte for this rendition. https://t.co/wQjiK3NOY0
— Narendra Modi (@narendramodi) October 31, 2020