పందెం రాయుళ్లపై పోలీసుల పంజా.. కళ్లు తిరిగే విషయాలు వెలుగులోకి

పందెం రాయుళ్లపై పోలీసుల పంజా.. కళ్లు తిరిగే విషయాలు వెలుగులోకి

కోడిపందాల స్థావరంపై శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మే 5వ తేదీ శుక్రవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో గతకొంత కాలంగా కోడి పందాలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు మెరుపు దాడులు చేశారు. పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందుతుల వద్ద నుండి రూ.23 వేల నగదు పాటు కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు గత కొంతకాలం నుండి గుట్టుచప్పుడు కాకుండా ఈ కోడి పందేలు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిపై శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.