బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి పై దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐపీసీ సెక్షన్స్ 148, 452, 354, 323, r/w 149 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ వీడియో ఆధారంగా 12 మందిని గుర్తించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని తెలిపారు.
సెక్యూరిటీ గార్డ్, ఇంటి పనిమనిషిపై దాడి చేసినట్లు విజయలక్ష్మీ పోలీసులకు వివరించారు. కారు, ఇంట్లో ఫర్నిచర్, పూలకుండీలు, దేవుడి ఫొటోలు ధ్వంసం చేసినట్లు చెప్పారు. అందుకు సంబంధించి వివరాలు పోలీసులకు అందించారు. దాడి చేసిన నిందితులను శిక్షించాలని పోలీసులను కోరారు.