నిజామాబాద్ లో ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు పోలింగ్

నిజామాబాద్ లో ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు పోలింగ్

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్ కుమార్ తెలిపారు.  48 గంటల ముందే అభ్యర్థులు తమ ప్రచారాన్ని నిలిపివేయాలని కోరారు.  రేపు 5 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని చెప్పారు.  ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఎనిమిదింటి వరకూ పోలింగ్ నిర్వహిస్తున్నట్టు రజిత్ కుమార్ తెలిపారు.