ప్ర‌ణ‌బ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు

ప్ర‌ణ‌బ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి శ‌నివారం ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రణబ్‌కి వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రణబ్‌ ఆరోగ్య సూచీలు నిలకడగా ఉన్నాయని, ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం పర్యవేక్షిస్తోందని వారు తెలిపారు. కాగా మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌కి ఈ నెల 10న సర్జరీ చేశారు. ఆ సమయంలో జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయనను అక్కడే ఉంచి చికిత్స అందిస్తున్నారు.