వెంటనే PRC ని అమలు చేయాలి

వెంటనే PRC ని అమలు చేయాలి

మూడేళ్లుగా పీఆర్సీని అమలు చేయకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు ఉద్యోగులు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలంటూ కోఠిలోని ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.పీఆర్సీతో పాటు బకాయి ఉన్న రెండు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల పేరు చెప్పి… ప్రభుత్వం పీఆర్సీని వాయిదా వేస్తూ వచ్చిందన్నారు. పీఆర్సీ ఇవ్వకుంటే ఉద్యోగులందరం ఐక్యంగా పోరాటం చేస్తామన్నారు.