మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు..!

మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు..!

మనదేశంలో లాక్ డౌన్ మరో రెండు వారాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. నాలుగో దశ లాక్ డౌన్ మే 31తో ముగియనుంది. అయితే అదే రోజు ప్రధాని మోడీ మన్ కి బాత్ కార్యక్రమంలో లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తూ ఉత్వర్వులు జారీ చేస్తారని ఇండియా టుడే కథనాన్ని ప్రచురించింది. కథనం ప్రకారం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదో దశ లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేయాలని మోడీ భావిస్తున్నట్లు సమాచారం.

కేంద్రం సంబంధిత అధికారుల సమాచారం ప్రకారం ప్రధాని మోడీ ఐదో దశ లాక్ డౌన్ ఫోకస్ అంతా 11నగరాలపై ఎక్కువగా ఉంటుందని, ఆ 11నగరరాల్లో 70శాతం కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

వాటిల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, థానే, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, కోల్ కతా, చెన్నై,ఇండోర్,పూణే నగరాలు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 1.52 లక్షల కరోనా వైరస్ కేసులలో 60 శాతం అహ్మదాబాద్, ఢిల్లీ , పూణే, కోల్‌కతా , ముంబై లలో ఎక్కువగా నమోదైనట్లు కేంద్రం నిర్ధారించినట్లు ఇండియా టుడే తెలిపింది.