
వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపును అందుకున్న ప్రియదర్శి (Priyadarshi).. జాతిరత్నాలు, మల్లేశం, బలగం లాంటి చిత్రాలతో హీరోగానూ మెప్పించాడు. ఈ క్రమంలో అతను హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ (Mohanakrishna) దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సెన్సిబుల్ సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రగంటితో ప్రియదర్శి సినిమా చేస్తుండటం పట్ల ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
Also Read: సైలెంట్గా మ్యారేజ్ చేసుకున్న..టాలీవుడ్ సోట్ట బుగ్గల సుందరి!
ప్రియదర్శికి జోడిగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫేమ్ రూప కొడువాయూర్ (Roopa) నటిస్తోంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి బ్యానర్లో ఇంద్రగంటికి ఇది మూడో చిత్రం. గతంలో ఇదే సంస్థలో నాని హీరోగా ‘జెంటిల్మన్’, సుధీర్ బాబు హీరోగా ‘సమ్మోహనం’ చిత్రాలు చేశారు.
అలాగే రీసెంట్ గా ఇంద్రగంటి తీసిన నాని 'వి', సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇక ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే సంకల్పంతో..ఈ సినిమా స్టార్ట్ చేసినట్లు సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.
Bringing you an out-n-out comedy entertainer in the hat-trick combo of our producer @krishnasivalenk garu - director #MohanKrishnaIndraganti garu ??
— Sridevi Movies (@SrideviMovieOff) March 25, 2024
✨ing @PriyadarshiPN @RoopaKoduvayur, #Production15 Shoot begins today!@ItsActorNaresh @TanikellaBharni #Vennelakishore… pic.twitter.com/caSONDG5rs