317 జీఓతో స్థానికులకు అన్యాయం

317 జీఓతో స్థానికులకు అన్యాయం

ఇబ్రహీంపట్నం : 317 జీఓతో స్థానికులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. 317 జీఓను రద్దు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఉపాధ్యాయుడు ప్రతాప్ చేస్తున్న రిలే నిరాహర దీక్షకు కోదండరాం సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్థానికతను పరిగణలోకి తీసుకుని టీచర్లను వారి జిల్లాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి..

మున్సిపల్ ఆఫీసులో 25మందికి పాజిటివ్

కాలనీలో చిరుత చక్కర్లు.. గేటు ముందు కూర్చొని