జేఎన్టీయూ రెక్టార్​గా విజయకుమార్ రెడ్డి

జేఎన్టీయూ రెక్టార్​గా విజయకుమార్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  జేఎన్టీయూహెచ్ రెక్టార్​గా ప్రొఫెసర్  కె.విజయకుమార్ రెడ్డి  అపాయింట్ కానున్నారు. ఈ మేరకు మంగళవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​లో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం, వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి సమక్షంలో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) సమావేశం  జరిగింది.  జనవరి 31న ఖాళీ అయిన రెక్టార్, రిజిస్ట్రార్​ పోస్టుల భర్తీపై అధికారులు చర్చించారు.

కొత్త రెక్టార్​గా జేఎన్టీయూ హైదరాబాద్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్​గా కొనసాగుతున్న విజయకుమార్​ రెడ్డిని నియమించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి బుధవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే చాన్స్ ఉంది.