హైదరాబాద్, వెలుగు : జేఎన్టీయూహెచ్ రెక్టార్గా ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డి అపాయింట్ కానున్నారు. ఈ మేరకు మంగళవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం, వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి సమక్షంలో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) సమావేశం జరిగింది. జనవరి 31న ఖాళీ అయిన రెక్టార్, రిజిస్ట్రార్ పోస్టుల భర్తీపై అధికారులు చర్చించారు.
కొత్త రెక్టార్గా జేఎన్టీయూ హైదరాబాద్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా కొనసాగుతున్న విజయకుమార్ రెడ్డిని నియమించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి బుధవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే చాన్స్ ఉంది.