
పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ 2025 ఫైనల్ ప్రారంభమైంది. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మెగా ఫైనల్లో నెగ్గి తొలిసారి ఐపీఎల్ చాంపియన్గా నిలవాలని ఇరు జట్లూ తహతహలాడుతున్నాయి. ఈ పోరులో ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, పంజాబ్ లీడర్ శ్రేయస్ అయ్యర్పై అందరి ఫోకస్ ఉండనుంది. ఈ మెగా ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్