ఒక్కో వెలమ కులస్థుడు రూ. 100 కోట్లు సంపాదించిండు: ఆర్‌‌‌‌‌‌‌‌.కృష్ణయ్య

ఒక్కో వెలమ కులస్థుడు రూ. 100 కోట్లు సంపాదించిండు: ఆర్‌‌‌‌‌‌‌‌.కృష్ణయ్య

 

  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అండ చూసుకునే ఇదంతా చేశారు

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో వెలమ కులం నుంచి కేసీఆర్ సీఎంగా పదేండ్లు పరిపాలించారని, ఆయన అండ చూసుకొనే ఒక్కో వెలమ రూ.100 కోట్లకు పైగా సంపాదించారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బీసీల సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌లోని బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో నిర్వహించిన సభలో  ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నేత వి. హనుమంతురావుతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఆర్‌‌‌‌‌‌‌‌.కృష్ణయ్య మాట్లాడుతూ, మిలిటెంట్ తరహా ఉద్యమాలతోనే ప్రభుత్వాలు దిగి వస్తాయని, ఆ దిశగా బీసీ డిమాండ్లపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. బీసీల డిమాండ్లపై కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వచ్చే నెల 5, 6 తేదీల్లో చలో ఢిల్లీకి పిలుపునిచ్చామన్నారు. తెలంగాణలో బీసీ ఉద్యమం బలంగా ఉండటం వల్లే బీజేపీ బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించిందని, కానీ రాష్ట్ర బీజేపీ నాయకులకు బీసీ సీఎం కావడం ఇష్టం లేదని విమర్శించారు.