ముషీరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లోగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలు బలంగా ఉద్యమిస్తున్నారని, రిజర్వేషన్ల విషయంలో ఈసారి ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. జాతీయ బీసీ అధికార ప్రతినిధి, ఢిల్లీ ఇన్చార్జ్వేణుమాధవ్, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఈనెల 16న ఏపీలోని విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ‘చలో విశాఖ.. బీసీ గర్జన’ సదస్సు పోస్టర్ను ఆదివారం విద్యానగర్ బీసీ భవన్ వద్ద కృష్ణయ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, జనగణనలో కులగణన చేయాలని డిమాండ్చేశారు. క్రిమిలేయర్ ను తొలగించాలని కోరారు.