మాట నిలబెట్టుకున్న లారెన్స్: తుఫాను బాధితురాలికి ఇల్లు కట్టించాడు

మాట నిలబెట్టుకున్న లారెన్స్: తుఫాను బాధితురాలికి ఇల్లు కట్టించాడు

గత సంవత్సరం తుఫానులో సర్వం కోల్పోయిన ఓ అవ్వకు ఇల్లు కట్టించి ఇచ్చాడు ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్. 2018 నవంబర్ లో గజ తుఫాను తమిళనాడులో విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ ధాటికి ఏడు జిల్లాల్లో తీరని నష్టం ఏర్పడింది. ఇందులో ఇల్లు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే   ఆపదరలో ఉన్న వారు తనను సంప్రదించాల్సిందిగా లారెన్స్ కోరాడు. దీంతో పలువురు ఒక అవ్వ ఫొటోను లారెన్స్ కు పంపారు. ఈమె తుఫాను ధాటికి తాను ఉంటున్న గుడిశెను కోల్పోయినట్లుగా తెలిపారు. దీంతో ఆ ముసలి అవ్వకు ఇల్లు కంటివ్వడానికి లారెన్స్ ఒప్పుకున్నాడు. దీంతో ఈ మధ్య ఇల్లు కట్టడం పూర్తయినట్టు తెలియజేశారు లురెన్స్. అయితే శనివారం అవ్వతో గృహప్రవేశం చేయించాడు. దీంతో పలువురు లారెన్స్ మంచితనాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ లు చేస్తున్నారు. ఇదే కాకుండా పలువురు చిన్నారులకు ఉచితంగా గుండె కు ఆపరేషన్ చేయించారు.