
క్రికెట్ లో ఫీల్డింగ్ ఎంత ముఖ్యం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫీల్డింగ్ లో చక్కగా రాణిస్తే సగం మ్యాచ్ గెలిచేయొచ్చు. కీలక సమయంలో ఒక్క గ్రేట్ క్యాచ్ అందుకొని మ్యాచ్ ని ప్రత్యర్థి వైపు నుంచి లాగేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మెరుపు రనౌట్స్ తో మ్యాచ్ ను మలుపు తిప్పిన సంధర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ తమిళ నాడు ప్రీమియర్ లీగ్ మాత్రం అత్యంత చెత్త ఫీల్డింగ్ తో గల్లీ క్రికెట్ ను గుర్తు చేశారు. శనివారం (జూన్ 14) దిండిగల్ డ్రాగన్స్, మధురై పాంథర్స్తో జరిగిన మ్యాచ్ లో ఈ విచిత్ర ఫీల్డింగ్ సంఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న మధురై పాంథర్స్ 20వ ఓవర్లో హై డ్రామా చోటు చేసుకుంది. ఈ ఓవర్ లో పాంథర్స్ బ్యాటర్ కవర్ ఫీల్డర్ వైపు షాట్ కొట్టాడు. కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు త్రో విసిరాడు. అయితే త్రో మిస్ అవ్వడమే కాదు బ్యాకప్ ఫీల్డర్ కూడా ఎదురుగా ఎవరూ లేరు. దీంతో ఫీల్డర్ పరిగెత్తుకుని వచ్చి బంతి విసిరేలోపు మరో పరుగు పూర్తి చేశారు. వికెట్ కీపర్ ఈ బంతిని అందుకోలేకపోవడంతో మూడో పరుగు కూడా పూర్తి చేశారు. పాయింట్ నుంచి బంతి విసిరినప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఎవరూ లేకపోవడంతో బంతి మిడ్ ఆన్ వైపుకు వెళ్ళింది.
చివరిగా మిడ్ ఆన్ లో ఉన్న ఫీల్డర్ బంతిని విసరకుండా చేత్తో పట్టుకొని ముందుకు వచ్చాడు. ఒక్క పరుగు కూడా రాని పరిస్థితుల్లో దిండిగల్ డ్రాగన్స్ పేలవ ఫీల్డింగ్ తో ఏకంగా మూడు పరుగులు వచ్చాయి. ఈ మూడు సందర్భాల్లోనూ రనౌట్ ఛాన్స్ లు మిస్ అయ్యాయి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన మధురై పాంథర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. 151 పరుగుల లక్ష్యాన్ని డ్రాగన్స్ కేవలం 12.3 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. కెప్టెన్ అశ్విన్ 29 బంతుల్లో 49 పరుగులు చేసి.. శివమ్ సింగ్ తో కలిసి 10.4 ఓవర్లలోనే 124 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Run out ❌
— TNPL (@TNPremierLeague) June 14, 2025
Dodge ball ✅@TNCACricket #TNPL #NammaOoruNammaGethu #TNPL2025 pic.twitter.com/eKA9jM2VgL