నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు.. హైకోర్టులో సవాల్ చేసిన RCB హెడ్ నిఖిల్

నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు.. హైకోర్టులో సవాల్ చేసిన RCB హెడ్ నిఖిల్

బెంగళూరు సిటీలోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో  11 మంది క్రికెట్ ఫ్యాన్స్ చనిపోయిన విషయం తెలిసింది. ఈ తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలోని మార్కెటింగ్ హెడ్ నిఖిల్ కారణం అంటూ కర్నాటక పోలీసులు కేసు పెట్టారు. ఆ వెంటనే అరెస్ట్ చేశారు. స్టేడియంలో RCB విజయోత్సవం ఉంటుంది.. ఎవరైనా రావొచ్చు.. టికెట్ లేదు ఫ్రీ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది ఈ నిఖిల్ అని విచారణ పోలీసులు తేల్చారు. ఈ డిజిటల్ పోస్ట్ కారణంగా.. 35 వేల కెపాసిటీ ఉన్న స్టేడియానికి.. 3 లక్షల మంది తరలివచ్చారు. దీని అంతటికి కారణం RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ అంటూ పోలీసులు కేసు పెట్టి.. అరెస్ట్ చేసేశారు.

తన అరెస్ట్ పై బాగా ఫీలవుతున్నారంట నిఖిల్. నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు.. అరెస్ట్ చేసేంత తప్పు ఏం చేయలేదు అంటూ.. కర్నాటక పోలీసుల తీరును సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు నిఖిల్. తన అరెస్ట్ అక్రమం అని.. తొక్కిసలాటకు.. చనిపోయిన వారితో సంబంధం లేదని.. తొక్కిసలాటకు తాను బాధ్యుడిని కాదంటూ తన పిటీషన్ లో వెల్లడించాడు నిఖిల్. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి నిఖిల్ సోసాలే మార్కెటింగ్ హెడ్ మాత్రమే కాదు.. రెవెన్యూ హెడ్ కూడానూ.. కర్నాటక ప్రభుత్వానికి, పోలీసులకు సంబంధం లేకుండానే.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విజయోత్సవ ర్యాలీని ఎనౌన్స్ చేయటం.. చిన్నస్వామి స్టేడియంలో ఈవెంట్ ఫిక్స్ చేయటం జరిగిందని.. ఆ తర్వాతనే ప్రభుత్వానికి, పోలీసులకు సమాచారం వచ్చిందనే వాదన ఉంది. నిఖిల్ ఆధ్వర్యంలోనే.. నిఖిల్ సమాచారంతోనే.. ఆర్బీసీ డిజిటల్ ప్లాట్ ఫాంలో.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని.. ఫ్రీ ఎంట్రీ అని ప్రకటించారని.. దీంతో లక్షల మంది క్రికెట్ ఫ్యాన్స్ తరలి వచ్చినట్లు పోలీసులు సాక్ష్యాలతో సహా చూపిస్తున్నారు.

ప్రస్తుతం జైలులో ఉన్న నిఖిల్ సోసాలే.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. తన అరెస్ట్ అక్రమం అని.. వెంటనే బెయిల్ ఇవ్వాలని పిటీషన్ వేశాడు.