హైదరాబాద్, వెలుగు: రిలయన్స్ జ్యువెల్స్ అక్షయ తృతీయ కోసం వింధ్య పేరుతో నగలను అందుబాటులోకి తెచ్చింది. మధ్యప్రదేశ్లోని వింధ్య కళాత్మక సంప్రదాయాల నుంచి ప్రేరణతో వీటిని తయారు చేశారు.
ఫ్యాషన్ ఐకాన్, బాలీవుడ్ నటి దిషా పఠానీ వారణాసిలోని రిలయన్స్ జ్యువెల్స్ స్టోర్లో వీటిని ఆవిష్కరించారు. ఈ నగల్లోని ప్రతి భాగాన్ని గ్వాలియర్ కోట, సాంచి స్థూపం, ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం వంటి మధ్యప్రదేశ్ స్మారక చిహ్నాల ప్రేరణతో తయారు చేశామని రిలయన్స్ తెలిపింది.