పుజారాతో ఆడితే నా ఫేస్ కలర్ మారిపోయేది: రోహిత్ శర్మ

పుజారాతో ఆడితే నా ఫేస్ కలర్ మారిపోయేది: రోహిత్ శర్మ
  • జూనియర్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బాగా ఇబ్బంది పెట్టాడు
  • తనను ఎలా ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలన్నదే మాకు మిలియన్ డాలర్ల ప్రశ్న
  • టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ


ముంబై: జూనియర్ క్రికెట్ ఆడే రోజుల్లో టీమిండియా వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాతనకు, తమ ముంబై జట్టుకు కొరకరాని కొయ్యగా ఉండేవాడని టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. పుజారాను ఔట్ చేయడం ఎలా?  అనేది జూనియర్ క్రికెట్ రోజుల్లో తాను, ముంబై టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేట్స్ ఎక్కువగా చర్చించుకునే మిలియన్ డాలర్ల ప్రశ్న అన్నాడు. సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహించిన చతేశ్వర్ రెండు– మూడు రోజుల పాటు క్రీజులో పాతుకుపోయి, తమను అలసిపోయేలా చేసేవాడని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. ఏజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్ క్రికెట్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో తమ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలుపోటములను పుజారావికెట్ నిర్ణయించేదన్న హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్ తన గొప్ప బ్యాటర్ లక్షణాలు అప్పటినుంచే కనిపించాయని పేర్కొన్నాడు.  పుజారాభార్య పూజ రాసిన 'ది డైరీ ఆఫ్ ఎ క్రికెటర్స్ వైఫ్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు ఇప్పటికీ గుర్తుంది టీమ్ మీటింగ్స్ అన్నీ పుజారా చుట్టూనే తిరిగేవి.  అతన్ని ఎలా ఔట్ చేయాలి?  ఒకవేళ చేయకపోతే మనం మ్యాచ్ ఓడిపోతామని చర్చించుకునేవాళ్లం’ అని హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్ తెలిపాడు. 

పుజారాపై మొదటి అభిప్రాయం అదే

పుజారా ప్రత్యర్థిగా ఉన్న జట్టుతో మ్యాచ్‌‌ ఆడితే  ఎండకు తన ఫేస్ కలర్ మారిపోయేదని, అది చూసి తన తల్లి కూడా ఆందోళన చెందేదని రోహిత్ సరదాగా గుర్తుచేసుకున్నాడు. ‘నాకు 14 ఏండ్ల వయసులో గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లినప్పుడు తిరిగి ఇంటికొచ్చేసరికి నా ముఖం రంగు పూర్తిగా మారిపోయేది. ఎందుకంటే అతను రోజంతా బ్యాటింగ్ చేసేవాడు, మేము 2-–3 రోజుల పాటు ఎండలో ఫీల్డింగ్ చేసేవాళ్లం. నేను ఇంటి నుంచి ఆడేందుకు వెళ్లినప్పుడు ఒకలా వారం– పది రోజుల తర్వాత తిరిగి వచ్చినప్పుడు మరోలా ఉన్నావని మా అమ్మ రెండుసార్లు అడిగింది. అప్పుడు నేనేం చేయాలి అమ్మా..  పుజారాఅనే ఒక ప్లేయర్ ఉన్నాడు. తన మూడు రోజులుగా బ్యాటింగ్ చేస్తున్నాడని చెప్పాను. పుజారాపై మాకు కలిగిన మొదటి అభిప్రాయం అదే’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఇక కెరీర్ ఆరంభంలోనే  రెండు మోకాళ్లకు తీవ్రమైన గాయాలైనప్పటికీ వందకు  పైగా టెస్ట్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడిన పుజారాను  రోహిత్ ప్రశంసించాడు. దీన్ని బట్టి ఆటపై అతనికున్న అంకితభావం ఎలాంటిదో చెప్పొచ్చని అన్నాడు. 

ఆ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అత్యంత కఠినమైనది: పుజారా 

తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2016–-17లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్–-గవాస్కర్ ట్రోఫీ అత్యంత కఠినమైన సిరీస్ అని పుజారాపేర్కొన్నాడు. ‘ఆ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మా టీమ్ బాగా ఆడలేదు. 200 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది.  రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మళ్లీ కష్టాల్లో పడ్డాం, కానీ నేథన్ లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా ఎదుర్కోవాలని నేను అనిల్ కుంబ్లేతో మాట్లాడాను. అప్పుడు కుంబ్లే  ఒక టెక్నికల్ సూచన ఇచ్చాడు. అది నాకు చాలా ఉపయోగపడింది’ అని పుజారా గుర్తు చేసుకున్నాడు.

నాన్న కోసం టెస్ట్ క్రికెట్ ఆడాలనుకున్నా..

తాను ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రుల త్యాగాలే కారణమని, వారి సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేనిదే ఇదంతా సాధ్యమయ్యేది కాదని రోహిత్ చెప్పాడు.  టెస్టు క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంతగానో ఇష్టపడే తన తండ్రి కోసమే ఆ ఫార్మాట్ ఆడాలనుకున్నానని వెల్లడించాడు. ఇంగ్లండ్ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు టెస్టు క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్ ఆ నిర్ణయం గురించి తొలిసారి మాట్లాడాడు. ‘మా నాన్న మొదటి నుంచి టెస్ట్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వీరాభిమాని. ఆయనకు ఈ కొత్త తరం టీ20 క్రికెట్ పెద్దగా నచ్చదు. నేను వన్డేలో 264 స్కోరు చేసినప్పుడు కూడా ఆయన సరే, బాగా ఆడావులే అని మాత్రమే అన్నారు. కానీ నేను టెస్టుల్లో 30, 40 రన్స్ చేసినా కూడా దాని గురించి ఎంతో వివరంగా మాట్లాడేవారు. అలాంటి నాన్న నేను టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు సహజంగానే కొంచెం నిరాశ చెందారు. కానీ, చివరికి నా నిర్ణయాన్ని అర్థం చేసుకుని సంతోషించారు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.