ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

నిన్న ఖమ్మంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారు. నిన్న రాత్రి శ్రీనివాస్ రెడ్డిని ఖమ్మం నుంచి హైదరాబాద్ మిధాని లోని డీఆర్డీవో అపోలో హాస్పిటల్ లో చేర్పించారు పోలీసులు. చికిత్స పొందుతూ ఈ ఉదయం శ్రీనివాస్ రెడ్డి చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. అంతకుముందే.. జిల్లా జడ్జి.. శ్రీనివాస్ రెడ్డి స్టేట్ మెంట్ రికార్డు చేసినట్టు జేఏసీ నాయకులు చెప్పారు.

శ్రీనివాస్ రెడ్డి  మృతితో అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నిరసన తెలుపుతున్నారు. హాస్పిటల్ లోకి వెళ్లేందుకు తమకు అనుమతివ్వాలంటూ నినాదాలుచేశారు. వారిని పోలీసులు అక్కడినుంచి బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి మరోచోటకు తరలించారు.