IND vs ENG 2025: ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. విజేత ఎవరో చెప్పిన సచిన్

IND vs ENG 2025: ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. విజేత ఎవరో చెప్పిన సచిన్

భారత్, ఇంగ్లాండ్ మధ్య మరి కాసేపట్లో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. శుక్రవారం (జూన్ 20) లీడ్స్ వేదికగా హెడింగ్లీలో తొలి టెస్ట్ కు రంగం సిద్ధమైంది. పాత తరాన్ని (పటౌడీ ట్రోఫీ) మైమరిపిస్తూ కొత్తగా రూపాంతరం చెందిన అండర్సన్‌‌‌‌–టెండూల్కర్‌‌‌‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌‌‌‌తో ఐదు టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు ఆడనుంది. గత పదేళ్లలో ఇండియా టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఐకాన్లుగా ఉన్న విరాట్‌‌‌‌ కోహ్లీ, రోహిత్‌‌‌‌ శర్మ రిటైర్మెంట్‌‌‌‌తో అతిపెద్ద శూన్యం ఆవరించింది. దాంతో ఇండియా బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌లో అనుభవం తక్కువగా కనిపిస్తోంది.

బ్రెండన్‌‌‌‌ మెకల్లమ్‌‌‌‌ కోచింగ్‌‌‌‌లో బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ సంప్రదాయాలను తుడిచి పెట్టేసింది. ఇలాంటి టైమ్‌‌‌‌లో ఇంగ్లిష్‌‌‌‌ జట్టును ఓడిస్తే యంగ్‌‌‌‌ టీమిండియా స్థాయి ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది. కొత్త కెప్టెన్‌‌‌‌ 25 ఏళ్ల శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ భవిష్యత్‌‌‌‌కు ఈ సిరీస్‌‌‌‌ అత్యంత ప్రధానం కాబోతున్నది. బ్యాటర్‌‌‌‌గా ఏం చేస్తాడనే దానిని కాసేపు పక్కనబెడితే టీమిండియా 37వ కెప్టెన్‌‌‌‌గా గిల్‌‌‌‌ జట్టును ఏ మేరకు నడిపిస్తాడన్నదే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మెగా టెస్ట్ సిరీస్ లో విజేత ఎవరో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. 

టీమిండియా ఇంగ్లాండ్ పై 3-1 తేడాతో విజయం సాధిస్తుందని సచిన్ అంచనా వేశాడు. ఇంగ్లాండ్ తో తొలి టెస్టుకు ముందు గిల్ కు కీలక సలహాలు ఇచ్చాడు. "బయట వ్యక్తులు అభిప్రాయాలను మాత్రమే ఇవ్వగలదు. బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోవద్దు. ఆటతోనే అందరికీ సమాధానం ఇవ్వాలి. డ్రెస్సింగ్ రూమ్ లో నీకు ఉండే గౌరవం ముఖ్యం". అని సచిన్ గిల్ కు కీలక సలహాలు ఇచ్చాడు. 

టెస్ట్ సిరీస్ లో భాగంగా లీడ్స్‌లోని హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. 2024 ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి. ఈ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది. 2007 నుంచి ఇంగ్లండ్‌‌‌‌లో టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ గెలవలేదు. గత పదేళ్లుగా రోహిత్‌‌‌‌, కోహ్లీ, బుమ్రా, అశ్విన్‌‌‌‌ పోరాడినా విజయాలు మాత్రమే దక్కాయి. దీంతో ఈసారి ఎలాగైనా సిరీస్‌‌‌‌ను నెగ్గాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. 

ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్

1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్    

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ESPNcricinfo (@espncricinfo)