నేను పిలిచా.. నా కళ్ల ముందే రైలు కింద పడ్డాడు

నేను పిలిచా.. నా కళ్ల ముందే రైలు కింద పడ్డాడు

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో వారం క్రితం ఆరేండ్ల చిన్నారిని రేప్‌ చేసి, చంపేసి పరారైన నిందితుడు రాజు స్టేషన్‌ ఘన్‌పూర్‌‌ వద్ద రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ రోజు (గురువారం) ఉదయం అతడు ఆత్మహత్య చేసుకోవడం తాము చూశామని రైల్వే గ్యాంగ్‌మెన్‌ చెబుతున్నాడు. తాము ఉదయం డ్యూటీకి వెళ్లిన సమయంలో పట్టాల పక్కనే నడుస్తూ రాజు కనిపించాడని, రైలు పట్టాలపై ఇనుప వస్తువులు తీసుకెళ్లే వాడేమోననుకుని  మొదట వెళ్లిపోవాలని చెప్పామని అన్నాడు. వెళ్లకపోవడంతో ఎవర్రా బాబూ అని పిలిచామని, ఎక్కడి నుంచి వచ్చా ఎంటని అడిగితే ఏమీ చెప్పలేదని ఆ గ్యాంగ్‌మెన్‌ తెలిపాడు. అతడి గడ్డం చూసి సైదాబాద్ రేప్ నిందితుడు రాజు అని గుర్తు పట్టామని, తోటి కార్మికులతో ఆ రేప్ ఘటన గురించి మాట్లాడడంతో పట్టుకుంటామని భయపడి రైలు కింద దూకేశాడని చెప్పాడు.

అంతకు ముందు రైలు వచ్చినా దూరంగా నడుస్తూ కనిపించాడని, కేవలం పట్టుకుంటే కొడతారేమోనన్న భయంతోనే అతడు సూసైడ్ చేసుకున్నాడని గ్యాంగ్‌ మెన్ అన్నాడు. దీంతో తమ స్టేషన్ మాస్టర్‌‌కు, 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చామని తెలిపాడు. అతడిపై ఉన్న పది లక్షల రివార్డ్ ఇస్తారేమోనని అనుకున్నానని చెప్పాడు.