చైనా ఓపెన్ మొదటి రౌండ్ లోనే టోర్నీ నుంచి సైనా ఔట్

చైనా ఓపెన్ మొదటి రౌండ్ లోనే టోర్నీ నుంచి సైనా ఔట్

చైనా  ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు షాక్ తగిలింది. ఇవాళ జరిగిన తొలి రౌండ్ లో థాయ్ లాండ్ ప్లేయర్ బుసానన్ చేతిలో సైనా ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో సైనా పోరు ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో సైనాపై ….19వ ర్యాంక్ బుసానన్ ఫస్ట్ నుంచి ఆధిపత్యం చెలాయించింది. దీంతో వరుస సెట్లలో 10-21, 17-21తో సైనాపై విజయం సాధించింది. అయితే బుసానన్ చేతిలో సైనా ఓడిపోవటం వరుసగా ఇది రెండోసారి.