డైరెక్టర్ పీఎస్ మిత్రన్ కు కారు గిఫ్ట్

డైరెక్టర్ పీఎస్ మిత్రన్ కు కారు గిఫ్ట్

కోలీవుడ్, టాలీవుడ్ లలో మంచి క్రేజ్ ఉన్న నటుల్లో ‘కార్తీ’ ఒకరు. తమిళ స్టార్ హీరో ‘కార్తీ’ నటించిన ‘సర్దార్’ చిత్రం కలెక్షన్ లలో దూసుకుపోతోంది. దీపావళి పర్వదినం సందర్భంగా.. అక్టోబర్ 21న ఈ మూవీ విడుదలైంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఇది మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమాలో డబుల్ రోల్ పోషించిన ‘కార్తీ’ స్పైగా, పోలీస్ ఆఫీసర్ గా అలరించారు. మంచి సక్సెస్ అందించిన ‘పీఎస్ మిత్రన్’ కు టయోటా కారును నిర్మాత ఎస్. లక్ష్మణ్ కుమార్ గిప్ట్ గా ఇచ్చారు. కారు తాళం చెవిని హీరో కార్తీ చేతుల మీదుగా అందించారు.

స్వయంగా  ‘కార్తీ’ కారును నడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలుగా నటించారు. సర్దార్ 2 గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిషన్ కంబోడియా త్వరలో మొదలవుతుందని.. వీడియోను షేర్ చేశారు. పీఎస్‌ మిత్రన్‌ డైరెక్ట్‌ చేయనున్న సర్దార్‌ 2 మూవీ 2023లో విడుదల కానుంది. పోలీస్ ఆఫసర్ గా ఉన్న కార్తీ స్పైగా మారడం.. తర్వాత ఏం చేశారన్న కథాంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.