డబ్బులిచ్చి మంత్రి హరీష్ రావు మీటింగ్కు జనాల తరలింపు

డబ్బులిచ్చి మంత్రి హరీష్ రావు మీటింగ్కు జనాల తరలింపు

బీఆర్ఎస్ నేతలు బరితెగించారు. పబ్లిక్ గానే డబ్బులు పంచుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గంలో గత రెండు రోజుల క్రితం మంత్రి  హరీష్ రావు పర్యటన నేపథ్యంలో బైక్ ర్యాలీకి , మీటింగ్ కు వచ్చిన వారికి ఒక్కొకరికి 500 రూపాయలను పంచారు. ఓ పెట్రోల్ బంక్ లో  మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరుడు స్తభంపల్లి సర్పంచ్ చల్లూరి రాంచందర్ గౌడ్ బహిరంగంగా డబ్బులు పంచాడు. సుమారు 5 లక్షల వరకు పంచినట్లు సమాచారం. బహిరంగంగా పెట్రోల్ బంకులో డబ్బులు పంపిణీ చేయడంతో పలు విమర్శలకు తావిస్తోంది.

పెట్రోల్ బంక్ లో డబ్బులు పంచుతున్న దృశ్యాలను కొందరు తమ సెల్ ఫోన్లలో షూట్ చేశారు. మంత్రి టూర్ కు జనాన్ని తరలించేందుకు సదరు సర్పంచ్ ఇలా చేయడంపై పలువురు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.