లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: శరద్ పవార్

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: శరద్ పవార్

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ఖారారు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో సీనియర్ రాజకీయ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఇందులో బాగంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ త్వరలో జరగనున్నలోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. తమ కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు పోటీ చేస్తారని చెప్పారు. కూతురు సుప్రియా సూలే, మనవడు పార్థ పవార్ లోక్‌సభ బరిలో దిగుతున్నారని పవార్ తెలిపారు. 2014 సాధారణ ఎన్నికల్లోనూ పవార్ పోటీచేయలేదు. అయితే ఈసారి పోటీ చేస్తారని పార్టీనేతలు, కార్యకర్తలు అనుకున్నారు.