శ్రేయస్‌‌‌‌, నేహల్‌‌‌‌ దూకుడుతో.. ఐపీఎల్ ఫైనల్ కు పంజాబ్

శ్రేయస్‌‌‌‌, నేహల్‌‌‌‌ దూకుడుతో.. ఐపీఎల్ ఫైనల్ కు పంజాబ్

టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (41 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 8 సిక్స్‌‌‌‌లతో 87 నాటౌట్‌‌‌‌) దుమ్మురేపడంతో.. ఐపీఎల్‌‌‌‌లో పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేహల్‌‌‌‌ వదేరా (29 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 48) కూడా అండగా నిలవడంతో.. ఆదివారం జరిగిన క్వాలిఫయర్‌‌‌‌–2లో పంజాబ్‌‌‌‌ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌‌‌‌కు చెక్‌‌‌‌ పెట్టింది. టాస్‌‌‌‌ ఓడిన ముంబై 20 ఓవర్లలో 203/6 స్కోరు చేసింది. తెలుగు బ్యాటర్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మ (29 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 44), సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (26 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 44), జానీ బెయిర్‌‌‌‌స్టో (24 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 38), నమన్‌‌‌‌ ధీర్‌‌‌‌ (18 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లతో 37) మెరుగ్గా ఆడారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పంజాబ్‌‌‌‌ 19 ఓవర్లలో 207/5 స్కోరు చేసింది. శ్రేయస్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

ఛేజింగ్‌‌‌‌లో పంజాబ్‌‌‌‌కు సరైన ఆరంభం దక్కకపోయినా.. శ్రేయస్‌‌‌‌, నేహల్‌‌‌‌ వదేరా అద్భుతంగా ఆడారు. మూడో ఓవర్‌‌‌‌లోనే ప్రభ్‌‌‌‌సిమ్రన్‌‌‌‌ సింగ్‌‌‌‌ (6) వెనుదిరిగాడు. ప్రియాన్షు ఆర్య (20), జోస్‌‌‌‌ ఇంగ్లిస్‌‌‌‌ వేగంగా ఆడారు. థర్డ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో ఇంగ్లిస్‌‌‌‌ రెండు ఫోర్లు, తర్వాతి  ఓవర్‌‌‌‌లో ఆర్య 4, 6 కొట్టాడు. కానీ ఐదో ఓవర్‌‌‌‌లో ఇంగ్లిస్‌‌‌‌ 4, 6, 4, 6తో 20 రన్స్‌‌‌‌ దంచాడు. ఆరో ఓవర్‌‌‌‌లో బౌలింగ్‌‌‌‌కు దిగిన అశ్విన్‌‌‌‌ కుమార్‌‌‌‌.. తొలి బాల్‌‌‌‌కే ఆర్యను ఔట్‌‌‌‌ చేయడంతో రెండో వికెట్‌‌‌‌కు 42 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఇదే ఓవర్‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌, ఇంగ్లిస్‌‌‌‌ చెరో ఫోర్‌‌‌‌ కొట్టడంతో పవర్‌‌‌‌ప్లేలో పంజాబ్‌‌‌‌ 64/2 స్కోరు చేసింది. ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్‌‌‌‌లో హార్దిక్‌‌‌‌ ఎనిమిదో ఓవర్‌‌‌‌లో ఇంగ్లిస్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి దెబ్బకొట్టాడు.

 శ్రేయస్‌‌‌‌తో కలిసి నేహల్‌‌‌‌ వదేరా సింగిల్స్‌‌‌‌తో ముందుకెళ్లాడు. 10వ ఓవర్‌‌‌‌లో 6, 4, 4తో స్కోరు 98/3కి పెరిగింది. తర్వాతి రెండు ఓవర్లలో 11 రన్సే రావడంతో ఒత్తిడి పెరిగింది. 13వ ఓవర్‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌ 6, 6, 6తో 19 రన్స్‌‌‌‌ రాబట్టాడు. 14వ ఓవర్‌‌‌‌లో వదేరా రెండు ఫోర్లు కొట్టాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో బుమ్రా రన్స్‌‌‌‌ కట్టడి చేయడంతో 15 ఓవర్లలో స్కోరు 147/3 స్కోరు చేసింది. ఈ దశలో ముంబై బౌలర్లు కాస్త పట్టు బిగించారు. సిక్స్‌‌‌‌ కొట్టిన నేహల్‌‌‌‌ను 16వ ఓవర్‌‌‌‌లో అశ్విన్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేయడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 84 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. శ్రేయస్‌‌‌‌ 6, 4తో 27 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 17వ ఓవర్‌‌‌‌లో శశాంక్‌‌‌‌ (2) రనౌట్‌‌‌‌ కావడంతో స్కోరు 17 ఓవర్లలో 173/5గా మారింది. ఇక 18 బాల్స్‌‌‌‌లో 31 రన్స్‌‌‌‌ కావాల్సిన దశలో స్టోయినిస్‌‌‌‌ (2 నాటౌట్‌‌‌‌)ను నిలబెట్టి.. శ్రేయస్‌‌‌‌ 4, 4, 6, 6, 6, 6 దంచి ఈజీగా విజయాన్ని అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 203/6 (తిలక్‌‌‌‌ 44, సూర్య 44, బెయిర్‌‌‌‌స్టో 38, ఒమర్‌‌‌‌జాయ్‌‌‌‌ 2/43). 
పంజాబ్‌‌‌‌: 19  ఓవర్లలో 207/5 (శ్రేయస్‌‌‌‌ 87*, నేహల్‌‌‌‌ 48, అశ్విన్‌‌‌‌ కుమార్‌‌‌‌ 2/55).