కశ్మీర్ లోయలో బంద్ జరుగుతోంది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హన్ వనీ ఎన్ కౌంటర్ జరిగి ఇవాళ్టికి మూడేళ్లు పూర్తైంది. దీంతో కశ్మీర్ లో బంద్ పాటిస్తున్నారు వేర్పాటువాదులు. శ్రీనగర్ సిటీ మొత్తం షట్ డౌన్ అయింది. దుకాణాలు, స్కూళ్లు, కాలేజీలు ఏవీ తెరచుకోలేదు. షట్ డౌన్ నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాయి భద్రతా బలగాలు.
Jammu & Kashmir: Shut down in Srinagar today, on the 3rd death anniversary of terrorist Burhan Wani. pic.twitter.com/QLc07Mxu8r
— ANI (@ANI) July 8, 2019