PSL 2025: 24 గంటల్లో ఇంగ్లాండ్ నుంచి పాకిస్థాన్‌కు: టాస్‌కు 10 నిమిషాల ముందు లాహోర్‌కు రజా

PSL 2025: 24 గంటల్లో ఇంగ్లాండ్ నుంచి పాకిస్థాన్‌కు: టాస్‌కు 10 నిమిషాల ముందు లాహోర్‌కు రజా

జింబాబ్వే స్టార్ క్రికెటర్  సికందర్ రజా డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడేందుకు ఒక యుద్ధమే చేశాడు. ఒక్క రోజులోనే ఇంగ్లాండ్ నుంచి పాకిస్థాన్ కు వచ్చి పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో కేవలం టాస్ కు 10 నిమిషాల ముందు అతను పాకిస్థాన్ లో అడుగుపెట్టడం విశేషం. అంతేకాదు వచ్చినందుకు పూర్తి న్యాయం చేశాడు. తమ జట్టు లాహోర్ ఖలందర్స్ కు విజయాన్ని అందించాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ తో జరిగిన ఉత్కంఠ ఫైనల్లో చివర్లో 7 బంతుల్లోనే 22 పరుగులు చేసి టైటిల్ అందించాడు. 

ALSO READ | ENG vs IND: ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?

నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, జింబాబ్వే జట్ల మధ్య టెస్ట్ సిరీస్ శనివారం (మే 24) ముగిసింది. ఆదివారం (మే 25) క్వెట్టా గ్లాడియేటర్స్,లాహోర్ ఖలందర్స్ జట్ల మధ్య పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. లాహోర్ ఖలందర్స్ తరపున ఆడుతున్న సికిందర్ రాజా పాక్ లీగ్ ఫైనల్ కోసం ఆ రోజే ఇంగ్లాండ్ నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో బర్మింగ్‌హామ్‌లో డిన్నర్..   దుబాయ్‌లో బ్రేక్ ఫాస్ట్.. అబుదాబిలో లంచ్ చేసి ఎట్టకేలకు మ్యాచ్ సమయానికి పాకిస్థాన్ చేరుకున్నాడు. 

కేవలం 24 గంటల్లో రాజా ఇంగ్లాండ్ నుంచి పాకిస్థాన్ కు చేరుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఒకవేళ రాజా సమయానికి చేరుకోపోతే అతని స్థానంలో లాహోర్ ఖలందర్స్ షకీబ్ అల్ హసన్‌ను ఆడించి ఉండేది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫైనల్లో క్వెట్టా  గ్లాడియేటర్స్ పై లాహోర్ ఖలందర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన క్వెట్టా  గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో లాహోర్ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి గెలిచింది. 

మరిన్ని వార్తలు