ఢిల్లీ మెట్రో రైలు లేడీస్ కోచ్ లో పాము.. సీట్లపైకి ఎక్కి హాహాకారాలు

ఢిల్లీ మెట్రో రైలు లేడీస్ కోచ్ లో పాము.. సీట్లపైకి ఎక్కి హాహాకారాలు

మెట్రో రైలు అంటే ఎంత రద్దీగా ఉంటుంది.. కాలు తీసి కాలు పెట్టలేం.. హైదరాబాద్ లోనే ఇలాంటి సిట్యువేషన్ అయితే.. ఇక ఢిల్లీ మెట్రో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వర్కింగ్ డేస్ లో.. మార్నింగ్, ఈవినింగ్ టైమింగ్స్ లో అయితే ఢిల్లీ మెట్రో విపరీతమైన రద్దీగా ఉంటుంది. బోగీల్లో కనీసం నిల్చోవటానికి కూడా ప్లేస్ ఉండదు.. అలాంటి మెట్రో రైలులో.. ఈవినింగ్ సమయంలో మెట్రో కోచ్ లో పాము అనే వార్త సంచలనంగా మారింది.. అందులోనూ లేడీస్ కోచ్ లో పాము అంటూ బోగీలోని మహిళలు అందరూ గందరగోళానికి గురైన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

2025, జూన్ 19వ తేదీ గురువారం సాయంత్రం.. ఢిల్లీ మెట్రో లేడీస్ కోచ్ లో పాము ఉందంటూ ఎవరో ఒకరు పెద్దగా కేకలు వేశారు. ఆ వెంటనే బోగీలోని మహిళలు అందరూ పెద్ద పెద్దగా కేకలు వేయటం.. కాళ్ల కింద చూసుకోవటం.. సీట్లపైకి ఎక్కటం.. భయంతో కేకలు వేయటం జరిగింది.. ఇదంతా వీడియో రికార్డ్ అయ్యింది. వీడియోలో మాత్రం పాము మాత్రం కనిపించలేదు. పాము అని ఎవరో అనటంతో ఇదంతా జరిగిందనే బోగీలోని మహిళల మాట. 

బోగీలో పాముతో గందరగోళానికి గురైన మహిళలు.. రైలు ఎమర్జన్సీ స్టాప్ బటన్ ను పదే పదే నొక్కారు. ఎమర్జన్సీ బటన్ నొక్కి.. డ్రైవర్ కు విషయాన్ని చెప్పారు. బోగీలోని సీసీ కెమెరాల్లో గందరగోళాన్ని చూసిన మెట్రో డ్రైవర్.. వెంటనే రైలును అక్షరథామ్ స్టేషన్ లో నిలిపివేశాడు. రైలు ఆగిన వెంటనే.. బోగీలో నుంచి మహిళలు స్టేషన్ లోకి పరుగులు తీశారు. ఆ తర్వాత బోగీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు.. పాము లేదని స్పష్టం చేశారు. 

నిత్యం రద్దీగా ఉండే బోగీలోకి.. అందులోనూ మెట్రో స్టేషన్ లోకి పాము రావటం ఎలా సాధ్యం అవుతుందనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బోగీలో ఎవరో మహిళ.. పాము పాము అంటూ కేకలే వేయటంతో అందరం భయపడ్డామని.. పాము మాత్రం ఎవరికీ కనిపించలేదని మహిళలు చెప్పటం విశేషం. మొత్తానికి ఇదంతా పుకారు అని అధికారులు చెబుతున్నారు. 

ఢిల్లీ మెట్రో ఎన్నో చిత్ర విచిత్రాలు చూశాం నిన్నటి వరకు.. ఇప్పుడు పాము అనేది కొత్తది.. ఢిల్లీ మెట్రో కాస్తా ఇప్పుడు స్నేక్ మెట్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.