కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మెడికల్ టెస్టుల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. సోనియాకు తోడుగా రాహుల్, ప్రియాంక ఆమె వెంట వెళ్తారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. సోనియా ఏ దేశానికి, ఎప్పుడు వెళ్తున్నారో మాత్రం వివరాలు తెలపలేదు.
ఢిల్లీకి వచ్చే ముందు అస్వస్థతతో ఉన్న సోనియాను ప్రియాంక పరామర్శిస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. మరోవైపు సెప్టెంబర్ 4న ఢిల్లీలో నిర్వహించే మెహంగాయి పర్ హల్లా బోల్ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిచనున్నారు.
ఈ నెల మొదటివారంలో సోనియా గాంధీకి రెండవ సారి కరోనా పాజిటివ్ వచ్చింది. జూన్ మొదటివారంలో ఆమె మొదటిసారి కరోనా బారిన పడ్డారు.