భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత సోనియా గాంధీ ఆమెను కలవడం తొలిసారి. ఇది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ అని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాగా ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదు. ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు సపోర్ట్ చేసింది.
Congress interim president Sonia Gandhi called on President Droupadi Murmu at Rashtrapati Bhavan, in Delhi pic.twitter.com/kaXIxTD6DP
— ANI (@ANI) August 23, 2022