
రైల్వే ప్రొడక్షన్ యూనిట్లను కార్పొరేటైజేషన్ చేయాలన్న ప్రతిపాదన సరికాదని ఎంపీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అన్నారు. రాయ్బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీని కార్పొరేటైజేషన్చేసే ప్రయత్నాన్ని తప్పుబట్టారు. మంగళవారం లోక్సభలో జీరో అవర్లో సోనియా మాట్లాడుతూ.. ప్రైవేటైజేషన్కు ఇది మొదటి అడుగని విమర్శించారు. దేశ సంపదను తక్కువ ధరలకు ప్రైవేటు వ్యక్తులపరంచేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల వేలాది మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతారని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు.
“యూపీఏ హయాంలో ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా మోడ్రన్ కోచ్ ఫ్యాకర్టీని ప్రారంభించాం. ఆ ఫ్యాక్టరీ భారతీయ రైల్వేల్లోనే అధునాతనమైంది, తక్కువ ధరలో బెస్ట్ కోచ్లను తయారు చేస్తోంది. ప్రభుత్వం దీన్ని కార్పోరేటైజేషన్ చేయాలని ఎందుకనుకుంటుందో తెలియడంలేదు. ఈ చర్యతో దాదాపు 2వేల మంది కార్మికుల భవిష్యత్తు నాశనమవుతుంది. పీఎస్యూలు ప్రజల సంక్షేమంకోసం పనిచేయాలి కానీ ప్రైవేటు వ్యక్తులకోసం కాదు” అని సోనియాగాంధీ అన్నారు. రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టకపోవడంపై ఆమె విమర్శలు చేశారు. ఆధునిక భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ను మాజీ ప్రధాని నెహ్రూ దేవాలయాలుగా అభివర్ణించారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆ ఆలయాలు ప్రమాదం అంచున ఉన్నాయని సోనియా గాంధీ విమర్శించారు. సోనియా గాంధీ చేసిన ఆరోపణలను రైల్వే శాఖ ఖండించింది.