కరోనా సమయంలో ప్రజలకు తన వంతుగా సాయం అందించి ఎంతో మంది మెప్పుపొందిన సినీ నటుడు సోను సూద్. ఆయన ఇటీవల తన పుట్టినరోజును జరుపుకున్నారు. జూలై 30న, సోనూ తన 48వ పుట్టినరోజును జరుపుకున్నారు. బర్త్ డే సందర్భంగా.. ఆయన అభిమాని, కళాకారుడు.. విపుల్ మిరాజ్కర్ 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సోనూసూద్ చిత్రపటాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు సోనూసూద్.. అది కాస్త వైరల్గా మారింది.
మహారాష్ట్రకు చెందిన విపుల్ మిరాజ్కర్ అనే వ్యక్తి 20 రోజుల్లోపు ఈ భారీ 50వేల చ.అడుగుల చిత్రపటాన్ని క్రియేట్ చేశాడు. దీన్ని చూసిన సోనూసూద్ ఆశ్చర్యపోయారు. ఇలాంటిది సాధ్యమవుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదు అంటూ క్రియేట్ చేసిన విపుల్కి ధన్యవాదాలు తెలిపారు.
డ్రోన్ కెమెరాలతో వీడియో తీయగా.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
www.facebook.com/watch/?v=588447688829606