
జూన్ 1వ తేదీన కేరళను నైరుతీ రుతుపవనాలు తాకుతాయని రైతులకు శుభవార్త తెలిపింది భారత వాతావరణ శాఖ. అయితే వర్షాలు సాధారణంగానే ఉంటాయని తెలిపింది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బిహార్, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు రాక 3 నుంచి 7 రోజులు ఆలస్యమయ్యే అవకాశం వుందని వాతావరణ శాఖ అంఛనా వేస్తోంది. అదే సమయంలో రుతుపవనాల తిరోగమనం 7-14 రోజులు ఆలస్యమయ్యే అవకాశం వుందంటున్నారు అధికారులు. తిరోగమనం ఆలస్యమవడం హర్షించదగ్గ విషయమని చెబుతున్నారు.
డైనమిక్ మోడల్ ప్రకారం సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ అంటోంది. లా-నినా పరిస్థితుల వల్ల అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. కరోనా కష్టకాలంలో రైతాంగానికి ఇది శుభవార్త చెబుతున్నామంటున్న అధికారులు.. దేశవ్యాప్తంగా వర్షపాతం సగటున 96%-104% మధ్య ఉంటుందని తెలిపారు.