SRH vs CSK: ఉప్పల్ స్టేడియం దగ్గర తోపులాట.. బారీకేడ్లను తోసేసిన అభిమానులు

SRH vs CSK: ఉప్పల్ స్టేడియం దగ్గర తోపులాట.. బారీకేడ్లను తోసేసిన అభిమానులు

ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం గేట్ నెం.4 దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టిక్కెట్లు ఉన్నా లోపలకి  అనుమతించపోవడంతో అభిమానులు బారీకేడ్లను తోసుకుంటూ లోపలకి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మొహరించారు. అభిమానులని ఒక్కొక్కరిగా స్టేడియంలోకి పంపిస్తున్నారు. దీంతో స్టేడియం పరిసరాల్లో భారీగా రద్దీ ఏర్పడింది. రాత్రి 7.30గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్ కోసం.. సాయంత్రం 5.30గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తునున్నారు.

ధోని చివరిసారి

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు(ఏప్రిల్ 5) చెన్నై సూపర్ కింగ్స్‌, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెన్నై అనగానే అందరికీ గుర్తొచ్చేది.. ధోని. అందునా అతనికిది చివరి ఐపీఎల్ కావడంతో అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అతన్ని మరోసారి చూసే అవకాశం ఉంటుందో.. లేదో అని ఇప్పుడే భారీగా తరలివస్తున్నారు. ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియం వద్దకు చేరుకునే సమయంలోనైనా అతన్ని చూడొచ్చని మధ్యాహ్నం 3 గంటల నుంచే స్టేడియం పరిసరాల్లో అభిమానులు పహారా కాస్తున్నారు.