- మంత్రి శ్రీధర్బాబు ట్వీట్
- ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దేశంలో టెస్లా పెట్టుబడులు పెడుతున్నదన్న ప్రకటనపై 2023 డిసెంబర్ నుంచి దృష్టి పెట్టామని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రానికి టెస్లాను తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని గురువారం ట్వీట్చేశారు. ‘రాష్ట్రంలో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నాం. భవిష్యత్అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నాం.
టెస్లా వంటి ప్రపంచంలోని మేటి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా అనుమతులను సులభతరం చేశాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు టెస్లాతో పరిశ్రమల శాఖ, ప్రభుత్వంలోని ఇతర శాఖలు నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నాయి’ అని మంత్రి శ్రీధర్బాబు ట్వీట్లో పేర్కొన్నారు.