హైదరాబాద్, వెలుగు: వచ్చే నెలలో బస్సు యాత్ర చేపట్టాలని రాష్ట్ర టీడీపీ నిర్ణయిం చింది. బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఆగస్టు మూడో వారంలో బస్సు యాత్ర చేపట్టాలని, ఇందుకోసం 9 కమిటీ లను ఏర్పాటు చేయాలని మీటింగ్లో నిర్ణ యించారు. మూడు నెలల కార్యాచరణ రూపొందించాలని, ఇందుకోసం ఈ నెల 28, 29 తేదీల్లో ఎన్టీఆర్ భవన్లో వర్క్షాప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకు న్నారు.
28న భువనగిరి, చేవెళ్ల, హైదరా బాద్, జహీరాబాద్, మహబూబ్గర్, మల్కాజ్గిరి, మెదక్, సికింద్రాబాద్, నల్గొండ.. 29న కరీంనగర్, ఖమ్మం, మహ బూబాబాద్, నాగర్ కర్నూల్, నిజామా బాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, వరంగల్ పార్ల మెంట్ నియోజకవర్గాల నాయకులతో వర్క్షాప్ నిర్వహించనున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని కాసాని తెలిపారు.

