పెరాలసిస్ తగ్గడం లేదని ఆత్మహత్య

పెరాలసిస్ తగ్గడం లేదని ఆత్మహత్య

మన్సురాబాద్ లో విషం తాగి

చనిపోయిన వృద్ధుడు

ఎల్ బీ నగర్,వెలుగు : పెరాలసిస్ తగ్గడం లేదని మనస్థాపానికి గురైన వృద్ధుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో జరిగింది. ఆదివారం పోలీసుల కథనం ప్రకారం..ఎల్ బీనగర్ పరిధిలోని మన్సురాబాద్ లో ఉంటున్న మన్నెం రాంరెడ్డి(65) 5 నెలలగా పెరాలసిస్ తో బాధపడుతున్నాడు. ఎన్ని హాస్పిటల్స్ చూపించుకున్న పెరాలసిస్ తగ్గకపోవడంతో దిల్ సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయంలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నాడు.

ఈ నెల 27న ట్రీట్ మెంట్ కోసం వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన రాంరెడ్డి తిరిగి రాలేదు. రాంరెడ్డి దిల్ సుఖ్ నగర్ లోనే ఉన్న కూతురి ఇంటికి వెళ్లి ఉంటాడని కుటుంబీకులు భావించారు. కానీ 28న అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద రాంరెడ్డి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  స్థానికులు రాంరెడ్డి కొడుకు వేణుగోపాల్ రెడ్డికి ఈ సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వేణుగోపాల్ పోలీసులకు విషయం చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.