రాష్ట్రపతికి కొత్త ఎంపీల జాబితా అందజేత

రాష్ట్రపతికి కొత్త ఎంపీల జాబితా అందజేత

17వ లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీల లిస్ట్ ను రాష్ట్రపతికి సమర్పించింది ఎన్నికల కమిషన్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాతో పాటు మిగతా ఇద్దరు కమిషనర్లు రాష్ట్రపతిని కలిశారు.  ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి అభినందించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు కృషి చేసిన ఎలక్షన్ కమిషన్, దానిలోని ఉద్యోగులు, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను కోవింద్ అభినందించారు.