కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా సునీల్ రావు

కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా సునీల్ రావు

కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా 33వ డివిజన్ కార్పొరేటర్ సునీల్ రావును TRS అధిష్టానం ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్ గా 37వ డివిజన్ కార్పొరేటర్ చల్లా స్వరూపారాణిని ఖరారు చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటకు మేయర్‌, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.

కరీంనగర్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా… 20, 37వ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 58 డివిజన్లకు ఈనెల 24న పోలింగ్ జరగ్గా… 27న ఫలితాలు వచ్చాయి. ఇందులో ఏకగ్రీవ స్థానాలతో కలుపుకొని టీఆర్ఎస్ 33 స్థానాల్లో విజయం సాధించింది. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ముగ్గురు, స్వతంత్రులు ఐదుగురు గెలవగా వీరిలో ఏడుగురు సభ్యులు ఇప్పటికే KTR సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.