జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట లభించింది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి ఓకే చెప్పారు చీఫ్ జస్టిస్ NV రమణ. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో సుప్రీంలో విచారణ జరిగింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదన్నారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని గుర్తు చేశారు. ఓ చిన్న జర్నలిస్టును ఎందుకు ఇబ్బందిపడాలన్నారు.

8,000 నుంచి 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నామని సుప్రీం చెప్పింది. జర్నలిస్టులకు  భూమి కేటాయించారు కానీ అభివృద్ధి చేయలేదని సీజేఐ అన్నారు. స్థలం అభివృద్ధి కోసం 1.33 కోట్లు డిపాజిట్ చేశారని చెప్పారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి మేం అనుమతిస్తున్నామని సుప్రీం తీర్పు చెప్పింది. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చని సుప్రీం అనుమతి ఇచ్చింది. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయాలని సీజేఐ సూచించారు.