హిజాబ్ విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా

హిజాబ్ విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా

హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విద్యాసంస్థల్లో  హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ గతంలో కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. కొందరు ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ఇవాళ సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోవైపు దీనిపై విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు. ముందస్తు విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేసి.. విచారణ వాయిదా వేయాలని కోరడమేంటని పిటిషనర్లను సుప్రీంకోర్టు మందలించింది. కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి.. విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.