సుప్రీం తీర్పు చారిత్రాత్మకం : లక్ష్మణ్

సుప్రీం తీర్పు చారిత్రాత్మకం : లక్ష్మణ్

హైదరాబాద్ : అయోధ్యపై  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన నేతలకు ఆయన కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. సుప్రీం తీర్పును కుహానా లౌకికవాదులే విమర్శిస్తున్నారన్నారు లక్ష్మణ్.

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ కు కోర్టులు, వ్యవస్థల మీద నమ్మకం లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేసీఆర్ కు ఆర్టీసీ సమ్మె ఉరితాడుగా మారుతుందని హెచ్చరించారు.